Sunday, May 14, 2017

పాతాళ భీమేశ్వరుడు,వేగాయమ్మపేట

ద్రాక్షారామానికి ఆనుకుని కేవలం 2 కి.మీ. దూరంలో యానాం వెళ్ళు మార్గంలో ఉంది వేగాయమ్మపేట .ఇది తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామము.ఇక్కడ ప్రాచీనకాలం నాటి శివలింగం బయటపడినది.దీన్ని తీసి మరొక చోట ప్రతిష్టించాలని తవ్వడం మొదలుపెట్టారు ఆ శివలింగాన్ని ఎంత తవ్వుతున్నా దాని మొదలు వరకు మాత్రము తవ్వలేక పోయారు ఎందు చేతనంటే దానిని ఎంత తవ్వినా లింగం మొదలు బయట పడక పోగా, నీరు పొంగిందే కానీ మొదలు దొరకలేదు . ఏమి చెయ్యలేక దానిని తవ్వడం ఆపి వేసి ఆలయాన్ని నిర్మించారు మరియు ఇప్పటికి ఆ శివుడు నీటిలోనే ఉండి భక్తులకు దర్శనమివ్వటం విశేషం. విచిత్రము ఏమిటంటే ఇది ద్రాక్షారామ భీమేశ్వర లింగాన్ని పోలి ఉండటం. అందుకే ఈ లింగానికి పాతాళ భీమేశ్వరుడు అనిపేరు పెట్టి పూజిస్తారు . పచ్చని పొలాల మధ్య ఆహ్లదకర వాతావరణంలో ఈ ఆలయం అలరారుతూ ఉంది.ఒకసారి దర్శించుకోండి . శుభం

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...