అవధూత చివటం అమ్మ : ఈమె అసలు పేరు అచ్చమ్మ. ఈమె దిగంబర యోగిని, ఈమె తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె రామనామాన్ని స్మరిస్తూ ఉండేవారు. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చునేవారు. ఒకనాదు ఆమె తన కొడుకుని తల్లికి అప్పగించి ఇల్లు విడిచి వెళ్ళీపోయింది. కొన్నాళ్ళూ ఆమె చిన్నాయి గూడెం లో ఉన్నారు. ఆ తర్వాత మన్నెం జగన్నాధపురం వెళ్ళీ ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలు మౌనంగా కఠిన దీక్షలు చేసారట. ఈ కాలంలో ఎన్నో మహిమలు ప్రదర్శించేవారని స్థానికుల నమ్మకం. రాజమండ్రి స్త్రీల మఠంలో కొంతకాలముండి, చివటం చేరారు. చివటం లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలుకూడా జారిపోతున్నా తెలియని స్తితిలో వుండేవారు. ఒకరోజు జారిపోతున్న తనచీరను తీసి ఒక బాలునిపై ఏం ఉందని చూస్తావురా అని విసిరి కొట్టి అప్పటినుండి దిగంబరంగావుండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టు క్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.
ఎక్కువకాలం అమ్మ స్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇల్లకుమాత్రమే బిక్షకువెళ్ళేవారు. బిక్షచేతిలో వుంచుకుని పరుగులు తీసేవారు. తనగురించి, శరీరసృహే లేకుండా చిదానందస్థితిలో వుండే ఆమెకు గ్రామమ్లోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగాతీసుకెళ్ళి స్నానము చేపించేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానం లో గడిపారు.
మహాత్ములు కూడా ఆమె దర్శనం కోసం వచ్చేవారు.పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టరు గారు కూడా అమ్మని దర్శించుకున్నారు అయితే వచ్చినవారి పాదాలను తాకి నమస్కరించేవారు అమ్మ. ఎదిగేకొద్దీ ఎలా ఒదగాలో సాధకులకు చేసి చూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలానమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వు పండిపోయావు నేనింకా పండవలసిన వాడిని అనిఅన్నారు. ధ్యానం ఎలాచెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారం చెయ్యాలి, ఆతర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానమ్లోంచి లేచేటప్పుడు కూడా, ఓంకారం చేయాలి. చీపురుపెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా వుంటుందో, అలాగే ఓంకారము చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యము తొలగిపోతుంది అని చెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం కూర అంతవినాలి, ధ్యానం అన్నమన్నమంత చేయాలి అనేవారు. ధ్యానం బంగారుముద్ద వంటిది, దానికి మించినదిలేదు. అనిచెప్పేవారు, అండుకొరకు ఎటువంటి నిబంధనలు అక్ఖరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవ్లేదే, రామరామా అనుకోండే అనేవారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవంకోసం అనేవారు అమ్మ. రామాలయమ్లోనివసిస్తూ స్వయంగా వంటచేసి అందరికీ తల్లిలా తినిపిస్తుండేవారు ఆమహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజులముందు తనపంటినిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు.
No comments:
Post a Comment